Telangana: కార్య‌క‌ర్త‌ల బీమా కోసం రూ.26.11 కోట్ల ప్రీమియం చెల్లించిన టీఆర్ఎస్‌

trs working presudent kts handed over bima premium to insurance companies

  • ఏడేళ్లుగా కార్య‌క‌ర్త‌ల‌కు బీమా ప్రీమియం చెల్లిస్తున్న టీఆర్ఎస్‌
  • ఏడేళ్ల‌లో ఇందుకోసం రూ.66 కోట్లు వెచ్చించిన పార్టీ
  • ఈ ఏడాది ప్రీమియం చెక్కును బీమా సంస్థ‌ల‌కు అందించిన కేటీఆర్‌

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ త‌న కార్యక‌ర్త‌ల బీమా కోసం గ‌డ‌చిన ఏడేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి బీమా ప్రీమియం మొత్తం రూ.26.11కోట్లను బీమా సంస్థ‌ల‌కు చెల్లించింది. ఈ మేర‌కు బీమా సంస్థ‌ల‌కు చెందిన అధికారుల‌కు మంగ‌ళ‌వారం ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ చెక్కును అంద‌జేశారు.

టీఆర్ఎస్ అందిస్తున్న బీమా ప్ర‌కారం ప్ర‌మాదంలో మృతి చెందే కార్య‌కర్త‌ల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల బీమా సొమ్ము అంద‌నుంది. అదే స‌మ‌యంలో ప్ర‌మాదాల్లో పూర్తి స్థాయి అంగ‌వైక‌ల్యం క‌లిగితే రూ. 1 ల‌క్ష‌, పాక్షిక అంగ‌వైక‌ల్యానికి రూ.50 వేలు అంద‌నున్నాయి. ఇందుకోసం గ‌డ‌చిన ఏడేళ్ల‌లో పార్టీ త‌ర‌ఫున రూ.66 కోట్ల‌ను వెచ్చించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News