MBBS: ఈ విద్యా సంవత్సరం నుంచి హిందీలోనూ ఎంబీబీఎస్.. ముందుకొచ్చిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్

Amit Shah to release Hindi books of MBBS on October 16

  • ఇప్పటికే మొదటి సంవత్సరం పుస్తకాలు హిందీలో ముద్రణ
  • ఈ నెల 16న ఆవిష్కరించనున్న కేంద్రమంత్రి అమిత్ షా
  • గతేడాది నుంచి బీటెక్‌‌ను కూడా ప్రాంతీయ భాషల్లో బోధిస్తున్న కాలేజీలు

ఎంబీబీఎస్‌ విద్యను హిందీలోనూ అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్ కళాశాల, చత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి విశ్వవిద్యాలయం ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారి అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ మేరకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఇప్పటికే హిందీలో ముద్రించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 16న భోపాల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో వీటిని ఆవిష్కరిస్తారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రెండు కళాశాలల్లో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాలి. అయితే, హిందీయేతర రాష్ట్రాలకు మాత్రం సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతేడాది బీటెక్‌ను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించారు. ఆంధప్రదేశ్‌లోని ఒక కళాశాలతోపాటు మొత్తం 14 కాలేజీలు ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ను బోధించేందుకు ముందుకొచ్చాయి. ఈసారి ఆ కాలేజీల సంఖ్య 20కి పెరిగింది.

MBBS
B-Tech
Local Launguages
Atal Bihari Vajpayee Medical University
Gandhi Medical College
Madhya Pradesh
Chhattisgarh
  • Loading...

More Telugu News