Supreme Court: సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం

Supreme Court Live Streaming Begins

  • ఎన్ఐసీ ప్లాట్ ఫామ్ పై ప్రసారం
  • భవిష్యత్తులో ఓటీటీ తెచ్చే యోచన
  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పై తొలి విచారణ

సుప్రీంకోర్టు ఓ చారిత్రాత్మక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని సోమవారం మొదలు పెట్టింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను లైవ్ వెబ్ కాస్ట్ రూపంలో విచారణ చేపట్టింది. అలాగే, ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య సేవల విభజనపై వివాదంపై పిటిషన్ లోనూ ఈ ధర్మాసనం విచారణ నిర్వహించనుంది.

మూడు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలు చేపట్టే కేసుల విచారణ వచ్చే 3-4 రోజుల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూట్యూబ్ లేదా మరే ఇతర ప్లాట్ ఫామ్ కై కాకుండా, ఎన్ఐసీ ప్లాట్ ఫామ్ పై ఆన్ లైన్ విచారణ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. భవిష్యత్తులో ప్రత్యేక ఓటీటీని కూడా తీసుకురావాలన్నది సుప్రంకోర్టు యోచన. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఓటీటీని తీసుకొచ్చే క్రమంలో ఉంది. యూట్యూబ్ కాకుండా కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేదుకు తమ సొంత ప్లాట్ ఫామ్ ను తీసుకొస్తామని ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ సోమవారమే ప్రకటించారు.

Supreme Court
Live Streaming
hearing
cases
  • Loading...

More Telugu News