Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. రెండో రోజు విశేషాలు ఇవీ!

- నిన్న 20 కిలోమీటర్ల మేర నడిచిన రాహుల్ గాంధీ
- ఆగస్త్యేశ్వరం నుంచి నాగర్ కోయిల్ వరకు నడక
- అప్పట్లో గాంధీ సందర్శించిన స్కూలును సందర్శించిన రాహుల్
- యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ నిన్న 20 కిలోమీటర్ల మేర నడిచారు. కన్యాకుమారిలోని అగస్త్యేశ్వరం నుంచి నాగర్కోయిల్ వరకు యాత్ర సాగింది. ఉదయం 7 గంటల నుంచి గం. 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం గం. 3.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన మాట్లాడారు. దేశానికి సేవ చేయాలన్న ఆసక్తి, ఉన్నత భావాలు ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.


