Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 298 కరోనా పాజిటివ్ కేసులు
![Telangana corona details](https://imgd.ap7am.com/thumbnail/cr-20220825tn63079596c1380.jpg)
- తాజాగా 21,489 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 130 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 435 మంది
- ఇంకా 2,416 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 21,489 కరోనా పరీక్షలు నిర్వహించగా, 298 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 130 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 26, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. మరో 582 మంది ఫలితాలు రావాల్సి ఉంది. అదే సమయంలో 435 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 8,33,231 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 8,26,704 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,416 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220825fr630795734f90f.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220825fr63079580d7a55.jpg)