TDP: 'నా ఆరాధ్య దైవం చంద్ర‌బాబు గారితో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది'.. అంటూ ఫొటో పోస్ట్ చేసిన యువనేత!

tdp karyakartha tweet on chandrababu

  • కుప్పంలో 3 రోజుల పాటు చంద్ర‌బాబు టూర్‌
  • హైద‌రాబాద్ నుంచి విమానంలో బెంగ‌ళూరు చేరిన చంద్ర‌బాబు
  • చంద్ర‌బాబు పక్క‌నే కూర్చుని ప్ర‌యాణించిన యువ నేత‌ శిష్ట్లా లోహిత్ 
  • చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని ఆకాశానికెత్తుతూ ట్వీట్‌

చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌కు బుధ‌వారం టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బ‌య‌లుదేరిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ నుంచి విమానంలో బెంగ‌ళూరు చేరిన చంద్ర‌బాబు.. అక్క‌డి నుంచి రోడ్డు మార్గం మీదుగా కుప్పం చేరారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు జ‌ర్నీలో విమానంలో చంద్ర‌బాబు ప‌క్క‌న కూర్చుని టీడీపీ యువనేత ఒకరు ప్రయాణించారు. అధినేత పక్కన కూర్చున్న ఆ యువనేత పేరు శిష్ట్లా లోహిత్. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నారు. విమానంలో చంద్ర‌బాబుతో క‌లిసి ఉన్న త‌న ఫొటోను ఆయన సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో చెబుతూ లోహిత్ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. 'కుప్పం పర్యటనకు బయల్దేరిన నా ఆరాధ్య దైవం టీడీపీ అధినేత చంద్ర‌బాబు గారితో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేసిన జగన్ రెడ్డి పాలనను గద్దె దింపడానికి బాబు గారు చేస్తున్న పోరాటంలో నేను సైతం కలిసి పోరాడటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది' అంటూ శిష్ట్లా లోహిత్ పేర్కొన్నాడు.

TDP
Chandrababu
Kuppam
Hyderabad
Bengaluru
Flight

More Telugu News