Bandi Sanjay: బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం.. పాదయాత్రపై లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న బీజేపీ

Hith tension at Bandi Sanjay residence

  • నిన్న బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • కరీంనగర్ లోని ఇంటి వద్ద వదిలిపెట్టిన వైనం
  • ఈరోజు ఇంటి నుంచే దీక్షను చేపట్టనున్న సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ లోని తన నివాసంలో పోలీసు దిగ్బంధంలో ఉన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు వద్ద ధర్మ దీక్షకు దిగిన ఆయనను పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను అక్కడి నుంచి తరలించి కరీంనగర్ లోని నివాసం వద్ద వదిలిపెట్టారు. కాసేపట్లో ఆయన తన ఇంటి వద్ద నుంచే దీక్షను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇంకోవైపు, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పాదయాత్రను ఆపేయాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పాదయాత్రను కొనసాగించేలా పోలీసులకు ఆదేశాలను జారీ చేయాలని కోర్టును కోరనున్నారు.

Bandi Sanjay
BJP
Karimnagar
Deeksha
  • Loading...

More Telugu News