Nara Lokesh: ఆదివాసీలను నమ్మించి వంచించారు: నారా లోకేశ్

YSRCP betrayed tribes says Nara Lokesh

  • నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
  • ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
  • ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచన

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పోలవరం ప్యాకేజీ దగ్గర నుంచి ఎన్నో ఏళ్లుగా గిరిజనానికి హక్కుగా వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం వరకు జగన్ రెడ్డి ఆదివాసులను నమ్మించి వంచించారని మండిపడ్డారు. మాటలతో కోటలు కట్టడం మాని వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News