Roja: మామూలు యాంకర్లు, నటులే కారు కొంటున్నారు... నేను కొంటే తప్పా?: టీడీపీ నేతలపై రోజా ఆగ్రహం

Roja fires on TDP leaders over new car issue

  • ఇటీవల బెంజి కారు కొన్న రోజా
  • రుషికొండ గిఫ్ట్ అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • ఏదీ దొరక్క దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • కావాలంటే బ్యాంకు లావాదేవీలు చూసుకోవచ్చని వ్యాఖ్యలు

ఇటీవల తాను కొత్త కారు కొంటే టీడీపీ నేతలు 'రుషికొండ గిఫ్ట్' అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారని ఆమె అన్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పన్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కారు కొనాలంటే లోన్ తీసుకుంటే సరిపోతుందని, తాను కారు కొనడం గొప్పేమీ కాదని అన్నారు. తన కొత్త కారు విషయంలో ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు ఏదీ దొరక్క ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని రోజా విమర్శించారు. ఏది అమ్మినా, ఏది కొన్నా ఎంతో పారదర్శకతతో ఉంటానని స్పష్టం చేశారు. చదువురాని వారికి కూడా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థమవుతుందని రోజా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News