CM Jagan: 'కాపు నేస్తం' కింద వరుసగా మూడో ఏడాది నిధులు విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan releases Kapu NestHam benefits

  • కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కార్యక్రమం
  • ఒక్క బటన్ క్లిక్ తో 3.38 లక్షల మంది ఖాతాల్లోకి నగదు
  • రూ.508.18 కోట్లు విడుదల
  • ఒక్కొక్కరికి మూడేళ్లలో రూ.45 వేలు ఇచ్చామన్న సీఎం

ఏపీలో వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద సీఎం జగన్ ఇవాళ మూడో విడత నిధులు విడుదల చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక్క బటన్ క్లిక్ తో నేరుగా కాపుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన 3,38,792 మందికి రూ.508.18 కోట్ల మేర ఆర్థిక సాయం విడుదల చేసినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.45 వేల మేర లబ్ది చేకూర్చినట్టు తెలిపారు. మొత్తమ్మీద ఈ మూడేళ్లలో కాపు నేస్తం ద్వారా రూ.1,492 కోట్లు ఇచ్చినట్టు సీఎం జగన్ వివరించారు. 

నవరత్నాల ద్వారా కూడా కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నామని, రూ.16,256 కోట్ల మేర లబ్ది చేకూర్చామని పేర్కొన్నారు. నాన్ డీబీటీ ద్వారా కాపులకు మరో రూ.16 వేల కోట్లు ప్రయోజనం కలిగించినట్టు వెల్లడించారు. కాపులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని తెలిపారు.

CM Jagan
YSR Kapu Nestham
Gollaprolu
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News