Telangana: తెలంగాణలో కొత్తగా 531 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona bulletin

  • గత 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 281 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 612 మంది
  • ఇంకా 4,630 మందికి చికిత్స

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు నిర్వహించగా, 531 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 281, రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 612 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,303 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,05,562 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,630 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona Virus
Bulletin
Updates
  • Loading...

More Telugu News