KTR: ఈ పుట్టినరోజు సందర్భంగా బైజూస్ ట్యాబ్ లు అందిస్తున్నాను: కేటీఆర్

KTR says he will distribute Bysus powered tabs to govt college students in Sircilla district

  • 46వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్
  • మూడేళ్ల కిందట గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం షురూ
  • వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిగా ఉందన్న కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తన వయసులో మరో ఏడాది పెరిగిందని, 46వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమాభిమానాలు ప్రదర్శించిన అందరి పట్ల ఎప్పటికీ విధేయుడినై ఉంటానని వివరించారు. అయితే, పుట్టినరోజు జరుపుకోవడంలో ఓ అర్థం ఉండాలన్న ఉద్దేశంతో మూడేళ్ల కిందట 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యాచరణ ప్రారంభించినట్టు కేటీఆర్ వెల్లడించారు. 

"గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా తొలి ఏడాది నేను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇస్తే, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కలిసి 120 అంబులెన్స్ ల వరకు విరాళంగా ఇచ్చారు. రెండో ఏడాది నేను వ్యక్తిగతంగా 200కి పైగా ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను దివ్యాంగులకు అందించాను. సహచర టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ సంఖ్యను 1,100 వరకు తీసుకెళ్లారు. ఈ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. 

ఇక, ఈ ఏడాది గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే ఇంటర్ విద్యార్థులకు బైజూస్ ట్యాబ్ లను వ్యక్తిగతంగా పంపిణీ చేస్తున్నాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇదెంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను" అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News