Congress: సీఎం కేసీఆర్ తో సీతక్క!... ఏటూరు నాగారంలో ఆసక్తికర దృశ్యం!

- వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్
- ఏటూరునాగారంలో కేసీఆర్తో కలిసిన సీతక్క
- కేసీఆర్ అధికారుల సమీక్షకూ హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాల పరిశీలనకు ఆదివారం బయలుదేరిన సీఎం కేసీఆర్... భద్రాచలం, ములుగు, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీఎం కేసీఆర్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సీఎం కేసీఆర్తో ఏటూరు నాగారంలో వరద ప్రాంతాలను పరిశీలించిన సీతక్క.. వరద నష్టంపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ పాలుపంచుకున్నారు.
