Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం

Minor sisters gang raped in Uttar Pradesh 5 arrested

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • బహిర్భూమికి వెళ్లిన బాలికలపై అఘాయిత్యానికి తెగబడిన యువకులు 
  • నిందితులు 19 నుంచి 23 ఏళ్ల లోపు వారన్న పోలీసులు

వరుస దారుణాలు వెలుగు చూస్తున్న ఉత్తరప్రదేశ్‌లో మరో విస్తుగొలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మావూ జిల్లా ద్వసరై గ్రామంలోని ఘోసి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాలికలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని వారి తండ్రి గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, నిందితులు 19 నుంచి 23 ఏళ్లలోపు వయసు వారేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలికల్లో ఒకరి వయసు 15 ఏళ్లు కాగా, మరో బాలిక వయసు 17 ఏళ్లని పేర్కొన్నారు.

Uttar Pradesh
Gang Rape
Girls
Nadwasarai
Crime News
  • Loading...

More Telugu News