Telangana: తెలంగాణలో తాజాగా 279 మందికి కరోనా

Telangana corona bulletin

  • గత 24 గంటల్లో 27,841 కరోనా పరీక్షలు
  • మరోసారి 250కి పైగా కొత్త కేసులు
  • హైదరాబాదులో 172 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 119 మంది
  • ఇంకా 1,781 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 27,841 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 279 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 172 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,95,572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,89,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,781 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona Virus
New Cases
Update
Media Bulletin
  • Loading...

More Telugu News