Harish Rao: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీశ్ రావు దంపతులు!

Harish Rao offers prayers to Tirumala Sri Venkateswara

  • కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న హరీశ్
  • శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న టీఎస్ మంత్రి
  • హరీశ్ దంపతులకు వేదాశీర్వచనం పలికిన ఆలయ అర్చకులు

తెలంగాణ మంత్రి హరీశ్ రావు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన... ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో హరీశ్ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News