YS Sharmila: మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నాడు: షర్మిల ఫైర్

Sharmila fires on KCR

  • మద్యం అమ్మకాలు పెంచి మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారన్న షర్మిల 
  • కేసీఆర్ ను ఓటుతోనే దెబ్బకొట్టాలని పిలుపు 
  • ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు పశువుల్లా అమ్ముడుపోయారని విమర్శ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. మద్యం అమ్మకాలను పెంచి... మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. అత్యాచారాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు, బంధువులున్నా కనీస చర్యలు లేవని అన్నారు. 

మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ ను ఓటుతోనే దెబ్బకొట్టాలని చెప్పారు. లేకపోతే మళ్లీ ఐదేళ్లు బలికావాల్సిందేనని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే.. ఎమ్మెల్యేలు సొంత వ్యాపారాల కోసం టీఆర్ఎస్ కు పశువుల్లా అమ్ముడుపోయారని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కొడుకులు, బంధువులు అత్యాచారాలు చేస్తున్నా... కనీస చర్యలు తీసుకోకుండా కేసీఆర్ గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. అత్యాచార ఘటనలు వినిపించడం లేదా? కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు.

  • Loading...

More Telugu News