TDP: డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా?... నారా లోకేశ్‌పై విజ‌యసాయిరెడ్డి ట్వీట్‌

vijay sai reddy satires on nara lokesh challenge

  • టెన్త్ విద్యార్థుల‌తో నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌
  • విద్యార్థుల ఐడీల ద్వారా ఎంట్రీ ఇచ్చిన కొడాలి, వ‌ల్ల‌భ‌నేని
  • ద‌మ్ముంటే నేరుగా రావాలంటూ లోకేశ్ స‌వాల్‌
  • లోకేశ్ స‌వాల్‌పై సెటైర్లు సంధిస్తూ విజ‌యసాయిరెడ్డి ట్వీట్

టెన్త్‌ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నిర్వ‌హించిన జూమ్ మీటింగ్‌లోకి ఎమ్మెల్యేలు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎంట‌రైన వ్య‌వ‌హారంపై టీడీపీ, వైసీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఈ క్ర‌మంలో విద్యార్థుల ఐడీల‌తో త‌న జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యేల‌పై విరుచుకుప‌డిన లోకేశ్... ద‌మ్ముంటే నేరుగా త‌న‌తో చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

నారా లోకేశ్ సంధించిన ఈ స‌వాల్‌కు వైసీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. జూమ్ మీటింగ్‌లోకి వ‌స్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్‌.. ఇక డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా లోకేశం? అంటూ ఆయ‌న లోకేశ్‌ను ప్ర‌శ్నించారు. 'చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా..' అన్నారు విజయసాయి వ్యంగ్యంగా.

TDP
Nara Lokesh
Vijay Sai Reddy
YSRCP
Zoom Meeting
Kodali Nani
Vallabhaneni Vamsi

More Telugu News