AP Govt: అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అంటూ దుష్ప్రచారం... స్పందించిన ఏపీ ప్రభుత్వం

AP Govt responds to fake press note

  • సోషల్ మీడియాలో దుష్ప్రచారం
  • ఓ నకిలీ ప్రెస్ నోట్ వైరల్
  • ఖండించిన ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • చర్యలు తీసుకుంటామని వెల్లడి

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ ప్రెస్ నోట్ పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించింది. 2022 ఏడాదికి గాను అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు చేస్తున్నారంటూ ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారని, కానీ అందులో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాము ఏ పథకాన్నీ రద్దు చేయడంలేదని, అది నకిలీ ప్రెస్ నోట్ అని వెల్లడించింది. 

కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ మేరకు తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. ఈ తరహా దుష్ప్రచారంపై తాము సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించినట్టు తెలిపింది. అధికారికంగా దీనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాదు, సదరు నకిలీ ప్రెస్ నోట్ ను కూడా ఫ్యాక్ట్ చెక్ విభాగం పంచుకుంది.

AP Govt
Amma Odi
Vahana Mitra
Press Note
Fake
Fact Check

More Telugu News