Sharmila: తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?: ష‌ర్మిల‌

sharmila slams kcr

  • తెలంగాణ రైతులను ఆదుకోవడానికి డబ్బులు లేవా అని ష‌ర్మిల నిల‌దీత‌
  • రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి లేవా అని విమ‌ర్శ‌
  • దేశాన్నేలడానికి పోవాలన్న దురదకు తెలంగాణ బిడ్డల ముంచకు దొరా అంటూ ట్వీట్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు పంజాబ్ లో ప‌ర్య‌టించి రైతుల కుటుంబాల‌కు సాయం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్సార్ టీపీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

''తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా? 

పంట దిగుబడి లేక, పెట్టుబడి రాక మీరు ఆదుకొంటారనే ఆశ చచ్చి సిద్ధిపేట రైతు మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడు. 11 లక్షల అప్పు తెచ్చి పంచాయతీ పనులు చేస్తే చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఎల్లయ్య చావడానికి ప్రయత్నించిండు. దేశాన్నేలపోవాలన్న మీ దురదకు తెలంగాణ బిడ్డల ముంచకు దొరా'' అని ష‌ర్మిల ట్వీట్ చేశారు. 


  • Loading...

More Telugu News