Corona Virus: దేశంలో కొత్త‌గా 2,487 క‌రోనా కేసులు

corona bulletin in inida

  • యాక్టివ్ కేసుల సంఖ్య‌ 17,692 
  • నిన్న కోలుకున్న‌ 2,878 మంది 
  • క‌రోనాతో నిన్న 13 మంది మృతి
  • మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,24,214

దేశంలో కొత్త‌గా 2,487 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 17,692 మంది చికిత్స పొందుతున్నార‌ని వెల్ల‌డించింది. క‌రోనా నుంచి నిన్న 2,878 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య మొత్తం 4,25,79,693గా ఉంద‌ని తెలిపింది. 

క‌రోనాతో నిన్న 13 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,24,214కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 15,58,119 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 191,32,94,864 క‌రోనా వ్యాక్సిన్ల‌ను వినియోగించారు.

  • Loading...

More Telugu News