Sharmila: కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి: షర్మిల

sharmila slams kcr

  • పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందేన‌న్న ష‌ర్మిల‌
  • మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే రూ.188 బిల్లు అని వ్యాఖ్య‌
  • ఇప్పుడు రూ.307కు చేరిందని విమ‌ర్శ‌లు

తెలంగాణ ప్ర‌భుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర‌ విమర్శలు గుప్పించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల గురించి ఆమె ప్ర‌స్తావిస్తూ ట్వీట్లు చేశారు. 

''కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే. మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే రూ.188 వచ్చిన బిల్లు ఇప్పుడు రూ.307కు చేరింది.

ఇక పెరిగిన ఛార్జీలన్నీ 50, 100, 200 యూనిట్ల లోపు వాడుకొనే పేద, మధ్య తరగతి వాళ్లకే భారం. వైఎస్సార్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా బస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఒక్క పైసా పెంచలేదు. కేసీఆర్ గారు మాత్రం పన్నులు పెంచడమే పనిగా పెట్టుకొని పేదోని నడ్డి విరుస్తున్నాడు. పన్నులు, ఛార్జీలు తోచినంత పెంచి జనాల ముక్కు పిండి బిల్లులు వసూల్ చేస్తున్నాడు'' అని ష‌ర్మిల విమర్శించారు. 

  • Loading...

More Telugu News