Nara Lokesh: బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగితే.. ఏదా గ‌న్‌? ఎక్కడా జ‌గ‌న్‌?: లోకేశ్‌

naralokesh slams jagan

  • గ‌న్ కంటే ముందొస్తానని జ‌గ‌న్ ప్ర‌చారం చేయించుకున్నార‌న్న లోకేశ్
  • ప్రొద్దుటూరులో ద‌ళిత‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగింద‌ని విమ‌ర్శ‌
  • కేసు మాఫీ చేయాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని ప్ర‌శ్న‌

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలిక‌పై కొంత‌కాలంగా ఓ యువ‌కుడు, అత‌డి స్నేహితులు 10 మంది క‌లిసి అఘాయిత్యానికి పాల్ప‌డ‌డంతో ఆమె గ‌ర్భం దాల్చింద‌ని ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను టీడీపీ నేత నారా లోకేశ్ పోస్ట్ చేశారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని ఆ వార్త‌లో పేర్కొన్నారు. ఆయా అంశాల‌ను నారా లోకేశ్ ప్ర‌స్తావించారు.

''గ‌న్ కంటే ముందొస్తాడ‌ని కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ప్ర‌చారం చేయించుకున్న జ‌గ‌న్ సొంత క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగ‌ని ద‌ళిత‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగితే.. ఏదా గ‌న్‌? ఎక్కడా జ‌గ‌న్‌? 

అమాయ‌క బాలిక‌పై లైంగిక దాడిని మ‌హిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని ప‌ట్టుకోకుండా కేసు మాఫీ చేయాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు? ప‌దిహేనేళ్లు కూడా నిండ‌ని బాలిక‌ని గ‌ర్భ‌వ‌తిని చేసిన నిందితుల‌ని కాపాడ‌ట‌మేనా మీరు ఆడ‌బిడ్డ‌ల‌కి క‌ల్పించే ర‌క్ష‌ణా? 

ఆ బాలికకు అన్యాయం జరిగితే దాని గురించి బయటకు తెలిస్తే ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తుంది అని ఆలోచిస్తున్నారు తప్ప... ఆ అమ్మాయికి న్యాయం చేయలేని స్థితిలో ఈ పాలన ఉంది, ఆడబిడ్డలకు రక్షణ లేదు అని స్పష్టంగా తెలుస్తుంది'' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News