Telangana: తెలంగాణలో తాజాగా 34 మందికి కరోనా పాజిటివ్

Thirty four coorna cases emerges in Telangana

  • గత 24 గంటల్లో 13,436 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 21 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 32 మంది
  • ఇంకా 383 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా 50కి లోపే రోజువారీ కేసులు వెల్లడవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 13,436 కరోనా పరీక్షలు నిర్వహించగా, 34 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 32 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,92,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,867 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 383 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
.

Telangana
Corona Virus
New Cases
Daily Update
  • Loading...

More Telugu News