Jagan: రేపల్లే రైల్వే స్టేషన్ లో మ‌హిళ‌పై గ్యాంప్ రేప్ కేసుపై స్పందించిన సీఎం జ‌గన్

jagan responds on gang rape case

  • పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానిత యువ‌కులు 
  • వారంతా రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారే
  • ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడిన జ‌గ‌న్
  • వివ‌రాలు అడిగి తెలుసుకున్న సీఎం

బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ లో గ‌త‌ అర్ధరాత్రి కొంద‌రు దుండ‌గులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ మ‌హిళ‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ ముగ్గురు అనుమానిత యువ‌కులు రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారని తెలిసింది. 

ఆ రైల్వేస్టేషన్ సమీపంలోనే నేతాజీ నగర్ ఉంటుంది. మద్యం మత్తులో వారు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. కాగా, మహిళపై సామూహిక అత్యాచార‌ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న‌ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడి, వివ‌రాలు అడిగి తెలుసుకుని ప‌లు సూచ‌న‌లు చేశారు.

  • Loading...

More Telugu News