Karnataka: వాహ‌నాల‌తో ర‌ద్దీగా ఉన్న రోడ్డు మ‌ధ్య‌లో కూర్చొని టిఫిన్ తిన్న వ్య‌క్తి.. వీడియో వైర‌ల్

man eats tiffin on road

  • బెంగ‌ళూరులోని బసవేశ్వర నగర్లో ఘ‌ట‌న‌
  • దోశ, వాట‌ర్ తెచ్చుకుని రోడ్డుపై కూర్చొని తిన్న వైనం
  • వాహ‌నాలు పక్క నుంచి వెళ్లాల‌ని సూచించిన తాగుబోతు

ఓ వ్య‌క్తి టిఫిన్, వాట‌ర్ బాటిల్ ప‌ట్టుకుని న‌డిరోడ్డుపైకి వ‌చ్చి, అక్క‌డే కూర్చొని తిన్నాడు. ర‌ద్దీగా ఉన్న ఆ రోడ్డుపై అత‌డు ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులోని బసవేశ్వర నగర్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. 

ఆ స‌మ‌యంలో ఆ వ్య‌క్తి మ‌ద్యం తాగి ఉన్నాడు. దోశ, వాటర్ బాటిల్ తో రోడ్డు మధ్యలో కూర్చుని, చాలా సేపు దోశ తిన్నాడు. వాహ‌నాలు పక్క నుంచి వెళ్లాల‌ని, టిఫిన్ తింటోన్న స‌మ‌యంలో త‌న‌ను డిస్ట‌ర్బ్ చేయ‌కూడ‌ద‌ని అత‌డు వాహ‌న‌దారుల‌కు సూచించాడు.   

         

  • Loading...

More Telugu News