YSRCP: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌తో అర‌కు మాజీ ఎంపీ భేటీ

ysrcpex mp kottapalln geetha meets telangana governor

  • అర‌కు నుంచి ఎంపీగా గెలిచిన గీత‌
  • ఆపై రాజ‌కీయాలకు దూరం 
  • తాజాగా తెలంగాణ గ‌వ‌ర్నర్‌తో భేటీ

ఏపీలో గతంలో వైసీపీ త‌ర‌ఫున ఎంపీగా గెలిచి... ఆ త‌ర్వాత వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రస్తుతం రాజ‌కీయాలలో చురుకుగా లేని అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌.. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని తెలంగాణ రాజ్ భ‌వ‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్‌తో ఆమె ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. గిరిజ‌న హ‌క్కుల కోసం పోరాడుతున్న నేత‌గా కొత్త‌ప‌ల్లి గీత త‌న‌ను క‌లిసిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

YSRCP
Andhra Pradesh
Araku
Tamilisai Soundararajan
Kottapally Geetha

More Telugu News