Acharya: తెరపైకి రోజుకో పేరు... అసలింతకీ 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరు..?

No clarity on Acharya pre release event chief guest

  • కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం
  • జంటగా నటించిన చిరంజీవి, కాజల్ 
  • రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే 
  • ఈ నెల 29న రిలీజ్
  • ఏప్రిల్ 23న ప్రీ రిలీజ్ వేడుక

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథి ఎవరన్న విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. 

తొలుత ఏపీ సీఎం జగన్ చీఫ్ గెస్టుగా వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని చాలామంది స్వాగతించారు కూడా. కానీ, అంతలోనే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తాజాగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు, పవన్ కల్యాణ్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా వస్తున్నాడని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. వీటిలో ఏది నిజం అన్నది చిత్రబృందమే చెప్పాలి. 

ఇంతవరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుపై చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రాకపోవడంతో దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక విషయంలోనూ ఇదే తీరు నెలకొంది. మొదట విజయవాడలో అని ప్రకటించిన చిత్రబృందం... ఆపై హైదరాబాదులో అని నిర్ధారించింది.

Acharya
Pre Release Event
Chief Guest
Chiranjeevi
CM Jagan
Pawan Kalyan
Rajamouli
Tollywood
Hyderabad
Vijayawada
  • Loading...

More Telugu News