Bihar: ఒకేసారి విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురి మృతి

Three teens dead after consuming poison in Aurangabad

  • బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఘటన
  • యువకుడు పెళ్లికి నిరాకరించడంతో విషం తాగిన బాలిక
  • అది చూసి మిగతా ఐదుగురు కూడా విషం తీసుకున్న వైనం
  • మరో ముగ్గురు బాలికల పరిస్థితి విషమం

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆరుగురు బాలికలు ఒకేసారి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాస్మా ప్రాంతానికి చెందిన వీరందరూ మంచి స్నేహితులు. వీరిలో ఓ బాలిక ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. అయితే, ఆ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలిక విషం తాగింది. అది చూసి మిగతా ఐదుగురూ విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 

ఈ ఘటనలో ముగ్గురు బాలికలు అక్కికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు మగధ్‌ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. యువకుడిని ప్రేమిస్తున్న బాలిక తొలుత విషం తాగిందని, అది చూసి మిగతా ఐదుగురు కూడా విషం తాగారని ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. బాలికలందరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారని, వయసు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. మిగతా ఐదుగురు అమ్మాయిలు విషం ఎందుకు తాగారన్న దానిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.

Bihar
Aurangabad
Girls
Suicide
  • Loading...

More Telugu News