Jagan: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన జగన్

Jagan leaves to Delhi

  • సాయంత్రం 4.30 గంటలకు మోదీతో భేటీ
  • రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై చర్చించనున్న సీఎం
  • అనంతరం నిర్మల, అమిత్ షాలను కలవనున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రధానితో చర్చించనున్నారు. 

పోలవరం ప్రాజెక్ట్ కు సవరించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News