Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 740 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 173 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతం వరకు పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 58,683కి చేరుకుంది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 17,498కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (3.82%), బజాజ్ ఫైనాన్స్ (3.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.60%), నెస్లే ఇండియా (2.20%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.16%), టాటా స్టీల్ (-1.98%), టెక్ మహీంద్రా (-1.69%), భారతి ఎయిర్ టెల్ (-0.68%), టైటాన్ (-0.60%).

  • Loading...

More Telugu News