YSRCP: ప్ర‌ధాని మోదీతో వైసీపీ ఎంపీల భేటీ.. ఎందుకోస‌మంటే..!

ysrcp mps met pm modi on bc census

  • బీసీ జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని విన‌తి
  • ఇప్ప‌టికే ప‌లు పార్టీలదీ ఇదే వాద‌న‌
  • గ‌తంలో టీఆర్ఎస్ కూడా బీసీ జ‌న‌గ‌ణ‌న కోసం ప‌ట్టు

వైసీపీ ఎంపీలు బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బీసీ జ‌న‌గ‌ణ‌న‌ను చేపట్టాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వైసీపీ ఎంపీలు ప్ర‌ధానికి ఓ విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. 

దేశంలో బీసీ జ‌న‌గ‌ణ‌నను ప్ర‌త్యేకంగా చేప‌ట్టాల‌ని చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యంపై తెలంగాణ‌కు చెందిన అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ప‌లుమార్లు కేంద్రానికి విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించింది. తాజాగా వైసీపీ కూడా ఇదే డిమాండ్‌ను కేంద్రం ముందుకు తీసుకురావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

YSRCP
Prime Minister
Narendra Modi
BC Census
  • Loading...

More Telugu News