Corona Virus: క‌రోనా కాల‌ర్ ట్యూన్‌కు ఇక‌పై స్వ‌స్తి?

Corona Caller Tune will be removed

  • క‌రోనా విజృంభ‌ణతో ప్రారంభ‌మైన కాల‌ర్ ట్యూన్
  • ప్ర‌స్తుతం కొవిడ్ త‌గ్గుముఖం
  • ఆ కాల‌ర్ ట్యూన్ వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల నుంచీ విజ్ఞ‌ప్తులు
  • తీసేయాల‌ని యోచిస్తోన్న కేంద్ర స‌ర్కారు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ ప్రారంభ‌మైన స‌మ‌యంలో దానిపై అవగాహన కల్పించేందుకు టెలికాం ఆపరేటర్లు క‌రోనా కాల‌ర్ ట్యూన్ ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత వాటిపై కూడా కాల‌ర్ ట్యూన్ ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించారు. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో పాటు క‌రోనాకు సంబంధించి ప‌లు కాలర్ ట్యూన్స్ ఫోన్ల‌లో వినిపించేవి. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇకపై ఆ కాలర్‌ ట్యూన్ ల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తున్న‌ట్లు తెలిసింది. 

అంతేగాక‌, ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం నిన్న ఓ లేఖ రాసింది. సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘంతో పాటు మొబైల్‌ వినియోగదారుల నుంచి కాలర్‌ ట్యూన్‌ నిలిపివేయాలని విజ్ఞప్తులు వచ్చాయ‌ని అందులో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో వాటిని నిలిపివేయాల‌న్న అంశాన్ని కేంద్ర స‌ర్కారు పరిశీలిస్తోందని తెలిసింది. 

క‌రోనా కాలర్‌ ట్యూన్స్‌ కారణంగా అత్యవసర సమయాల్లోనూ ఫోన్‌కాల్‌ మాట్లాడటంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ప్రజల నుంచి కూడా త‌మ‌కు విజ్ఞప్తులు అందాయ‌ని దీంతో కేంద్రం ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తున్నట్లు ప్ర‌భుత్వ‌ అధికార వర్గాలు చెప్పాయి. మ‌రోవైపు, ఈ నెల 31 నుంచి కేవలం మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధ‌న‌లు మాత్ర‌మే మాత్రమే కొనసాగనున్నాయి.

  • Loading...

More Telugu News