MS Dhoni: ధోనీ మార్కు నిర్ణ‌యం.. సీఎస్కే కెప్టెన్‌గా రవీంద్ర జ‌డేజా

MS Dhoni hands over Chennai Super Kings captaincy to Ravindra Jadeja

  • ఈ సీజ‌న్‌లోనే సీఎస్కే కెప్టెన్ గా జ‌డేజా
  • జ‌ట్టులో స‌భ్యుడిగా కొన‌సాగ‌నున్న ధోనీ
  • ధ్రువీక‌రించిన సీఎస్కే జ‌ట్టు యాజ‌మాన్యం

కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ నిర్ణ‌యాలు ఏ ఒక్క‌రికి అంతుప‌ట్ట‌నివిగా ఉంటాయి. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న నుంచి తాజాగా ఐపీఎల్ లో తాను నేతృత్వం వ‌హిస్తున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ప‌గ్గాల‌ను వ‌దిలేసే దాకా.. కీల‌క నిర్ణ‌యాల‌న్నింటిలోనూ ధోనీ త‌న‌దైన మార్కును చూపించాడు.

తాజాగా ధోనీ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో సీఎస్కే జ‌ట్టు కెప్టెన్‌గా టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ ఐపీఎల్‌తో పాటు భ‌విష్య‌త్తులోనూ మ‌రింత కాలం పాటు సీఎస్కే జ‌ట్టులో స‌భ్యుడిగానే కొన‌సాగ‌నున్న ధోనీ.. బుధ‌వారం నాడు జ‌ట్టు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను జ‌డేజాకు అప్ప‌గించాడు. ఈ విష‌యాన్ని సీఎస్కే జట్టు యాజ‌మాన్యం ధ్రువీక‌రించింది.

  • Loading...

More Telugu News