Janasena: రేపటి నుంచి జ‌న‌సేన క్రియాశీల‌ స‌భ్య‌త్వ న‌మోదు

Janasena active membership registration from tomorrow

  • 27 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ స‌భ్య‌త్వ న‌మోదు
  • 5 ల‌క్ష‌ల క్రియాశీల స‌భ్య‌త్వ‌మే ల‌క్ష్యం
  • పార్టీ శ్రేణుల‌కు నాడెండ్ల సూచ‌న‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన త‌న క్రియాశీల స‌భ్య‌త్వ న‌మోదు ఈ నెల 20 (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేర‌కు పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌క‌టించారు. క్రియాశీల స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా శ‌నివారం ఆయ‌న ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. 

ఆదివారంతో ప్రారంభం కానున్న క్రియాశీల స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించనున్నట్టుగా నాదెండ్ల వెల్ల‌డించారు. కొత్త‌గా స‌భ్య‌త్వ న‌మోదుతో పాటు పాత స‌భ్య‌త్వాన్ని రెన్యూవ‌ల్ చేసుకునే అవ‌కాశాన్ని పార్టీ స‌భ్యులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. వారం పాటు సాగ‌నున్న క్రియాశీల స‌భ్య‌త్వ న‌మోదు‌ను 5 ల‌క్ష‌ల మార్కును దాటేలా కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News