KCR: కేసీఆర్ కోలుకోవాలంటూ వారణాసిలో వెలిసిన ఫ్లెక్సీలు!

KCR flexis in Varanasi

  • నిన్న వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్
  • కాశీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సాయి అనే అభిమాని
  • 'దేశ్ కా నేత' కేసీఆర్ అని ఫ్లెక్సీలపై రాసిన వైనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో నిన్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కోలుకోవాలని రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు. ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని పరీక్షల అనంతరం వైద్యులు తెలిపారు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కేసీఆర్ పట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు చెందిన సాయి అనే కేసీఆర్ అభిమాని ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం గంగానదిలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించి, నదిలోని బోట్లలో కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై 'దేశ్ కా నేత' అంటూ కేసీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఫ్లెక్సీపై కేటీఆర్, కవిత, హరీశ్ రావు తదితర నేతల ఫొటోలను కూడా ముద్రించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ, కేసీఆర్ కు కాశీ విశ్వనాథుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశానని చెప్పారు.

  • Loading...

More Telugu News