Telangana: తెలంగాణ‌లో కొత్తగా క‌రోనా మ‌ర‌ణాల్లేవ్‌.. కొత్త కేసులెన్నంటే..!

telangana corona virus updates

  • గత 24 గంటల్లో 19,947 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు
  • ఇంకా 2,968 మందికి చికిత్స

గ‌డచిన 24 గంటల్లో తెలంగాణలో 19,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,931 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,81,852 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,968 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో మరణాలేవీ నమోదు కాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 4,111గా ఉంది.

  • Loading...

More Telugu News