Ukraine: ర‌ష్యా దాడుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి అండర్ గ్రౌండ్‌లో ప్ర‌జ‌లు.. అక్క‌డే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఓ మ‌హిళ‌

Woman gives birth to baby

  • అండ‌ర్‌గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌లో త‌ల‌దాచుకుంటోన్న ప్ర‌జ‌లు
  • చాలా మందికి ఆహారం, వైద్యం కూడా అంద‌ని వైనం
  • ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోన్న ప్ర‌జ‌లు

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు జ‌రుపుతోన్న నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ ప్రాణాలు కాపాడుకోవ‌డానికి బంకులు, అండ‌ర్‌గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌లో త‌ల‌దాచుకుంటోన్న విష‌యం తెలిసిందే. చాలా మందికి ఆహారం, వైద్యం కూడా అంద‌డం లేదు. దీంతో ర‌ష్యా దాడులు జ‌రుపుతోన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. 

ఈ నేప‌థ్యంలో అండ‌ర్‌గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌లో త‌ల‌దాచుకున్న ఓ గ‌ర్భిణీ అక్క‌డే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కాగా, ఉక్రెయిన్ నుంచి ల‌క్ష‌లాది మంది విదేశాల‌కు త‌ర‌లివెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐక్య‌రాజ్య స‌మితి తెలిపింది. సొంత ఇళ్ల‌ను విడిచి వెళ్తున్న ప్ర‌జ‌ల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం.

  • Loading...

More Telugu News