Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

corona bulletin in inida

  • దేశంలో కొత్త‌గా 11,499 కరోనా కేసులు
  • నిన్న క‌రోనా వ‌ల్ల‌ 255 మంది మృతి
  • 1,21,881 యాక్టివ్ కేసులు
  • రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతం

దేశంలో కొత్త‌గా 11,499 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 23,598 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల‌ 255 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,21,881 మంది చికిత్స తీసుకుంటున్నారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 4,22,70,482గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 5,13,481కు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 177,17,68,379 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

  • Loading...

More Telugu News