Corona Virus: నిన్న దేశంలో 13,405 మందికి క‌రోనా

corona bulletin in inida

  • నిన్న 235 మంది మృతి
  • రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతం
  • మొత్తం మృతుల సంఖ్య 5,12,344
  • 175,83,27,441 డోసుల వ్యాక్సిన్ల వినియోగం

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. నిన్న దేశంలో 13,405 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 34,226 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. క‌రోనా వ‌ల్ల నిన్న 235 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,81,075 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది.

ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉందని తెలిపింది. క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 4,21,58,510 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,12,344కి పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 175,83,27,441 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

  • Loading...

More Telugu News