Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన‌ రోజువారీ క‌రోనా కేసులు

corona bulletin in inida

  • నిన్న 25,920 మందికి క‌రోనా
  • 492 మంది మృతి
  • రోజువారీ పాజిటివిటీ రేటు 2.07 శాతం
  • కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,19,77,238

దేశంలో రోజువారీ క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. నిన్న దేశంలో 25,920 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్న న‌మోదైన కేసుల కంటే నిన్న 4,837 కేసులు త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. అలాగే, నిన్న క‌రోనాతో మొత్తం 492 మంది ప్రాణాలు కోల్పోయారు.

క‌రోనా నుంచి నిన్న‌ 66,254 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,92,092 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,19,77,238గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 174,64,99,461 డోసుల వ్యాక్సిన్లు వేశారు.

  • Loading...

More Telugu News