Chiranjeevi: కాసేప‌ట్లో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఏపీకి చిరు, నాగ్, మ‌హేశ్, ఎన్టీఆర్, ప్ర‌భాస్

chiranjeevi nag to meet jagan

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై వివాదం
  • సినీ ప్ర‌ముఖుల‌తో చ‌ర్చించ‌నున్న జ‌గ‌న్
  • ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖుల లంచ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై నెల‌కొన్న వివాదంపై చ‌ర్చించేందుకు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ రోజు చ‌ర్చించ‌నున్నారు. హీరోలు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్‌, మహేశ్ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, ప‌లువురు నిర్మాత‌లు కాసేప‌ట్లో హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్ర‌యం నుంచి వెళ్ల‌నున్నారు. ఏపీలోని తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం జగన్‌తో కలిసి వారు లంచ్ చేస్తారు. సినిమా సమస్యలపై చర్చలు జరుపుతారు.

  • Loading...

More Telugu News