Chiranjeevi: క‌రోనా నుంచి కోలుకుని.. షూటింగ్‌కు వెళ్లిన చిరంజీవి.. ఫొటోలు ఇవిగో

chiranjeevi pics viral

  • 'గాడ్ ఫాదర్' సినిమా సెట్స్‌లోకి చిరు
  • తాను కోలుకోవాలని ప్రార్థించినవారందరికి ధన్యవాదాలు
  • ట్వీట్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్‌ చిరంజీవికి కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన విష‌యం తెలిసిందే. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకున్న చిరంజీవి క‌రోనా నుంచి కోలుకున్నారు. కొన్ని రోజులుగా షూటింగుల‌కు బ్రేక్ ఇచ్చిన ఆయ‌న మ‌ళ్లీ షూటింగుకు హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ బ్యాక్ టూ వర్క్ అంటూ ఆయ‌న‌ ట్వీట్ చేశారు.

                     
'గాడ్ ఫాదర్' సినిమా సెట్స్‌లోకి తాను ఉండ‌గా తీసిన ప‌లు ఫొటోల‌ను చిరంజీవి పోస్ట్ చేశారు.
తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించినవారందరికి ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు, రేపు ఉదయం 11 గంటలకు టాలీవుడ్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.
                     
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో టాలీవుడ్‌లోని అన్ని సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఇందులో చిరు కూడా పాల్గొని ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ఆయ‌న వివ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, మెగాస్టార్ న‌టించిన 'ఆచార్య' సినిమా విడుద‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం గాడ్ ఫాదర్ సినిమాపై దృష్టి పెట్టారు. 
                 

  • Loading...

More Telugu News