Andhra Pradesh: ఏపీలో కొత్తగా 165 మందికి కరోనా పాజిటివ్

AP Corona Dailyt Statistics

  • గత 24 గంటల్లో 24,219 కరోనా పరీక్షలు
  • విశాఖ జిల్లాలో 35 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 1,260 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 24,219 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 165 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 35 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 27, కృష్ణా జిల్లాలో 21, గుంటూరు జిల్లాలో 19, తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 130 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,486 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,729 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,260 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,497కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Daily Statistics
Today Cases
  • Loading...

More Telugu News