Sensex: 612 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Sensex ends 612 points high

  • ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్   
  • 185 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.19 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లన్నీ ఈరోజు పాజిటివ్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 612 పాయింట్లు లాభపడి 56,931కి పెరిగింది. నిఫ్టీ 185 పాయింట్లు పెరిగి 16,955కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.94%), ఎల్ అండ్ టీ (2.69%), భారతి ఎయిర్ టెల్ (2.67%), సన్ ఫార్మా (2.47%), రిలయన్స్ (2.42%).

టాప్ లూజర్స్:
విప్రో (-0.58%), ఐటీసీ (-0.24%), నెస్లే ఇండియా (-0.17%).

  • Loading...

More Telugu News