Andhra Pradesh: ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

AP records 163 new corona cases

  • చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 25 కేసుల చొప్పున నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,821

ఏపీలో గత 24 గంటల్లో 35,071 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 163 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 25 కేసుల చొప్పున నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 3 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇదే సమయంలో నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,75,271కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,58,979 మంది కోలుకున్నారు. మొత్తం 14,471 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,821 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News