Rohit Sharma: దక్షిణాఫ్రికా టూర్ ముంగిట టీమిండియాకు ఎదురుదెబ్బ... గాయంతో రోహిత్ శర్మ దూరం

Injured Rohit Sharma out of South Africa tour

  • ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్
  • ముంబయిలో టీమిండియా ప్రాక్టీసు
  • తొడ కండరాల గాయానికి గురైన రోహిత్
  • రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్ ఎంపిక

దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ నెల 26 నుంచి 2022 జనవరి 15 వరకు దక్షిణాఫ్రికాతో భారత జట్టు 3 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కు కోహ్లీ కెప్టెన్ కాగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్.

అయితే, ముంబయిలో నెట్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దాంతో అతడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. టెస్టు జట్టులో రోహిత్ శర్మ స్థానాన్ని గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ తో భర్తీ చేస్తున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News