Telangana: తెలంగాణలో కొత్తగా 157 మందికి కరోనా పాజిటివ్

Telangana corona daily media report

  • గత 24 గంటల్లో 36,147 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 56 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,741 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,147 కరోనా పరీక్షలు నిర్వహించగా, 157 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 56 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ జిల్లాలో11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, ములుగు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,469 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,65,755 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,741 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,973కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Report
Today Cases
  • Loading...

More Telugu News