TRS: ఈ విషయంలో ఇండియాలో టాప్ త్రీలో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ!

TRS TDP YSRCP in top 3 places in donations

  • విరాళాల సేకరణలో టాప్ త్రీలో తెలుగు రాష్ట్రాల పార్టీలు
  • 2019-20లో టీఆర్ఎస్ కు వచ్చిన విరాళాలు రూ. 89 కోట్లు
  • టీడీపీకి రూ. 81 కోట్లు.. వైసీపీకి రూ. 74 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ రాజకీయ పార్టీలు విరాళాల సేకరణలో చాలా ముందున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో అత్యధిక విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ తొలి స్థానంలో, టీడీపీ రెండో స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి. విరాళాల రూపంలో టీఆర్ఎస్ కు రూ. 89 కోట్లు, టీడీపీకి రూ. 81 కోట్లు, వైసీపీకి రూ. 74 కోట్లు వచ్చాయి. ఈ వివరాలను ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది.

ఇదే ఏడాది దేశంలోని మొత్తం 25 ప్రధాన ప్రాంతీయ పార్టీలకు రూ. 803.24 కోట్ల విరాళాలు వచ్చినట్టు ఏడీఆర్ తెలిపింది. వీటిలో రూ. 445.77 కోట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చాయని వెల్లడించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన విరాళాల్లో 95 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయని తెలిపింది.

  • Loading...

More Telugu News