Andhra Pradesh: ఏపీలో కొత్తగా 348 కరోనా కేసుల నమోదు

348 corona cases registers in Andhra Pradesh

  • తూర్పుగోదావరి జిల్లాలో 69 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,220

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 41,244 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 69 కేసులు నమోదు కాగా... కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

 ఇదే సమయంలో 358 మంది కరోనా నుంచి కోలుకోగా... ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,69,066కి పెరిగింది. మొత్తం 20,51,440 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,406కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,220 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

  • Loading...

More Telugu News